
హామీలపై ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలి
రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్టపాలనకు ముకుతాడు వేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని మదనపల్లి నియోజకవర్గవె ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు
ఆకేపాటి అమర్నాథ్రెడ్డి