నల్లగొండ టూటౌన్: ఇంటర్న్షిప్తో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సురేష్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ విద్యార్థులకు ఇంటర్న్షిప్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటర్న్షిప్ల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మార్గం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేఖ, ఎం. జయంతి, జ్యోతి, రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.


