చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయం ఎంతో చరిత్రాత్మకమైనది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది పండుగ రోజు. ఎవరో ఇస్తే కాకుండా హక్కుగా మహిళలు చట్టసభల్లోకి వెళ్తారు. ఇప్పటికే అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్టసభల్లో హక్కు అందని ద్రాక్షగా మిగిలింది. అలాంటి తరుణంలో మహిళా సమాజానికి హక్కు కల్పిస్తూ చట్టం రావడం శుభ పరిణామం. రానున్న రోజుల్లో మహిళలు చట్టసభల్లో గొప్పగా రాణిస్తారు.
– డాక్టర్ ఉజ్జిని మంజుల, ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, చౌటుప్పల్.


