మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో వలిగొండ–తొర్రూరు ప్రధాన రహదారిపై వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం హయత్నగర్కు చెందిన ఐదుగురు తెల్లవారు జామున తొర్రూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలడుగు శివారులో కారు అదుపుతప్పింది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్న బైక్ను మరో బైక్ ఢీ కొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


