భూదాన్పోచంపల్లి : పోచంపల్లిలో 18న నిర్వహిస్తున్న భూదాన వజ్రోత్సవాలకు హాజరుకావాలని సోమవారం హైదరాబాద్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు ఆహ్వానపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య మాట్లాడుతూ.. వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత లవకుమార్, కొట్టం కరుణాకర్రెడ్డి, తడక యాదగిరి, కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, తొలుపునూరి కృష్ణ, పోతగల్ల నర్సింహ పాల్గొన్నారు.


