భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్తో కూడినది
రామగిరి(నల్లగొండ): భారత ఆర్థిక వ్యవస్థను 40 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాల్తో కూడినదని హైదరాబాద్లోని ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ, పీఎం ఉషా ఆర్థిక సహకారంతో ‘వికసిత్ భారత్–2047 స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనా వ్యాసాలు సమర్పించారు. అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ ప్రొఫెసర్ సీహెచ్. కృష్ణారెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ అడిషనల్ సీఓఈ కె. కృష్ణారెడ్డి, మునుస్వామి. మల్లేశం, బట్టు కిరీటం, నర్సింగ్ కోటయ్య, వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు, జ్యోత్స్న, హబీబ్, దినేష్, అంకుష్, నాగరాజు, హస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు.


