ఆందోళనతో వెనక్కి తగ్గిన డీఈవో | - | Sakshi
Sakshi News home page

ఆందోళనతో వెనక్కి తగ్గిన డీఈవో

Jul 29 2025 4:29 AM | Updated on Jul 29 2025 10:29 AM

ఆందోళనతో  వెనక్కి తగ్గిన డీఈవో

ఆందోళనతో వెనక్కి తగ్గిన డీఈవో

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రతి మండలంలో 190 మంది ప్రధానోపాధ్యాయులు/స్కూల్‌ అసిస్టెంట్లను పీ–4 మార్గదర్శకులుగా తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఇచ్చిన మరుసటి రోజు సాయంత్రం 5 గంటల లోపు ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో డీఈఓ తన ఉత్తర్వులపై యూ టర్న్‌ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉపాధ్యాయులెవరినీ కూడా పీ4లో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. మార్గదర్శిగా నమోదు స్వచ్చంద కార్యక్రమమని ఆ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించే విషయంలో జిల్లా కలెక్టర్‌ కూడా వ్యతిరేకమన్నారు. డీఈఓ యూటర్న్‌ తీసుకోవడంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement