కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా | - | Sakshi
Sakshi News home page

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా

Jun 18 2025 7:24 AM | Updated on Jun 18 2025 7:24 AM

కనెక్

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా

రెండవ తరగతి చదువుతున్న మా పాపకు ‘తల్లికి వందనం’ డబ్బులు వేయలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెబుతున్నారు. ఆక్వా పట్టుబడులకు రోజువారీ కూలీ పనులకు వెళ్లే మేము ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇంకా కరెంటు కనెక్షన్‌ కూడా ఇవ్వలేదు.

– సంగాని కనకదుర్గ, బియ్యపుతిప్ప

నేనుండేది అద్దె ఇంట్లో.. నాకు 8 మీటర్లా?

ఈ ప్రభుత్వం మాలాంటి పేదలకు అన్యాయం చేయడం దుర్మార్గం. అద్దె ఇంటిలో ఉంటున్న నాకు 8 విద్యుత్‌ కనెక్షన్లు చూపిస్తున్నాయని చెబుతున్నారు. తల్లికి వందనం ఇవ్వకుండా కుంటి సాకులు చూపడం అన్యాయం. సమస్య పరిష్కారం కోసం నరసాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాను.

– ఇందుకూరి సోమేశ్వరరావు. నరసాపురం

కరెంట్‌ బిల్లు రూ.వంద లోపే

ఎన్నికల ముందు పిల్లలందరికీ తల్లికి వందనం వేస్తామన్నారు. మొదటి ఏడాది ఎలాగూ వేయలేదు. నాకు పాప, బాబు ఉంటే ఇప్పుడూ ఒక్కరికీ కూడా వేయలేదు. మాకు కరెంటు బిల్లు వంద రూపాయల లోపే వస్తుంది. అయినా 300 యూనిట్లకంటే ఎక్కువ వినియోగిస్తున్నారనే సాకుతో పథకాన్ని నిలిపివేశారు.

– మత్తి జాన్‌శామ్యూల్‌, నరసాపురం, క్రిస్టియన్‌పేట

ఒక్కరికీ ఇవ్వలేదు

నాకు రెండవ తరగతి చదివే మనుమడు, మూడవ తరగతి చదివే మునుమరాలు ఉన్నారు. ఒక్కరికీ తల్లికి వందనం డబ్బులు వేయలేదు. మాకు కరెంటు బిల్లు రూ.150 మాత్రమే వస్తుంటే.. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటున్నారు. మాలాంటి వాళ్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.

– పిల్లి సుగుణమ్మ, మల్లవరం

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా  
1
1/3

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా  
2
2/3

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా  
3
3/3

కనెక్షనే లేదు.. బిల్లు ఎక్కువ వచ్చిందంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement