వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా ఘటన.. మహిళ మృతి

భీమదేవరపల్లి: ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ (మంగళపల్లి) శివారులో గురువారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన ఏలూరి రవీందర్‌రెడ్డి, వీరారెడ్డి, కిరణ్‌, రాధ హుస్నాబాద్‌ మండలం పోతారాంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం కారులో తిరిగి వస్తుండగా.. రాంనగర్‌ శివారులో కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement