రౌడీ షీటర్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్‌ అరెస్టు

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

రాజాం సిటీ: బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మరో రౌడీ షీటర్‌ను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ డి.నవీన్‌కుమార్‌ సోమవారం వెల్లడించారు. ఈ నెల 25న మధ్యాహ్నం కంచరాం గ్రామానికి చెందిన ఎల్‌.రవిమోహన్‌ అతని స్నేహితుడు రామసుందరంతో కలిసి బొబ్బిలి రోడ్డులోని ఫైర్‌స్టేషన్‌ వెనుక తోటలో మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో రౌడీ షీటర్‌ అయిన సిరిపురపు దేవరాజు అక్కడికి చేరుకున్నాడు. మద్యం తాగుతున్న రవిమోహన్‌, రామసుందరంలపై దాడిచేయడంతోపాటు డబ్బు, ఫోన్‌ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి రూ.వెయ్యితోపాటు ఫోన్‌ బలవంతంగా తీసుకున్నాడు. ఈ దాడిలో గాయపడిన రవిమోహన్‌ రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్సనిమిత్తం చేరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహించి దేవరాజును సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement