ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వస్తుంది. పంటలు పండుతాయని ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నకు ఒక రకంగా ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందనే చెప్పుకోవాలి. వ్యవసా యం అంటే ఇంత చులకనగా చూడడం టీడీపీ ప్రభుత్వానికి భావ్యం కాదు. నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఎకరా నా సొంత భూమి, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుకు సిద్ధం చేశాను. కానీ అటు వర్షాలు కురవక ఇటు ఎత్తి పోతల పథకం పనిచేయక సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వనరు ఉన్నా కూడా సాగునీరందడం లేదు.
–సామిరెడ్డి సూర్యనారాయణ, రైతు కొట్టక్కి


