న్యూస్రీల్
విజయనగరం
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని రైతులు గడిచిన రెండేళ్ల క్రితం వరకు ఆనందంగా పంటలు సాగుచేశారు. ప్రస్తుతం సాగునీరు లేక అవస్థలు పడుతున్న రైతులను ఆదుకునే నాథుడే కరువయ్యాడు. సకాలంలో వర్షాలు కురవక, వనరులు ఉన్నా సాగునీరు అందక సాగు భూములన్నీ బీడుగా మారుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి వనరులున్న చోట చివరి ఆయకట్టు వరకు సాగునీరందించి అన్నదాతను ఆదుకోవాలన్న లక్ష్యంతో గతంలో ప్రభుత్వాలు నిర్మించిన ఎత్తి పోతల పథకాలు పూర్తిగా పనిచేయని విధంగా పాడై మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఆయా ఆయకట్టుల రైతులు సాగునీటి అవస్థలు పడుతున్నారు. –రామభద్రపురం
ఓ వైపు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు..ఫలితంగా మరో వైపు పర్యావరణానికి ముప్పు.


