జూలై ఒకటో తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలులోకి రానుంది. ఉపాధిహామీ పథకంగా ఉన్న పేరును వీబీజీరామ్జీ పథకంగా మార్పు చేశారు. ఇప్పటి వరకు ఎలా పనులు జరిగాయో ఇకపై కూడా అలానే జరుగుతాయి.ప్రస్తుతం ఉపాధి వేతనదారులకు పనులు ఆపే ప్రసక్తి లేదు. నిరంతర ప్రక్రియ. అయితే వేతనాలకు, గ్రామాల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు 60 శాతం కేంద్రం ప్రభుత్వం,40 రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనున్నాయి. వేతనదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిబంధనల ప్రకారం పనిచేసిన తర్వాత 15 రోజులలోపు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఎస్.శారదాదేవి,డ్వామా పీడీ, విజయనగరం


