● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరంలీగల్: వచ్చే నెల 11వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో మోటార్ ప్రమాద బీమా కేసులును ఎక్కువ సంఖ్యలో పరిష్కరించి, కక్షిదారులకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు కక్షిదారులను ఉద్దేశించి గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 11వతేదీన జరగబోయే ఆదాలత్లో మోటార్ ప్రమాదంలో గాయపడిన వ్యకులకు, మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులకు ఆసరాగా నిలిచే ఇన్సూరెన్స్ మొత్తాలాకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఆర్.కృష్ణ ప్రసాద్ ,ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
రామభద్రపురం: మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి వంగపండువలసలో గురువారం విద్యుత్ షాక్ తగిలి విద్యుత్ ఓ కార్మికుడు మృతి చెందాడు, ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాశల సత్యనారాయణ(42) విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.గురువారం ఆదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటి మోటార్ పనిచేయడం లేదని మరమ్మతు చేయాలని కోరింది. దీంతో సత్యనారాయణ మోటార్ మరమ్మతు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడికి ఇద్దరు భార్యలు పద్మావతి, విజయలక్ష్మి ఉండగా ఇద్దరు ఆడపిల్లలు,ఒక అబ్బాయి ఉన్నారు.మొదటి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఆర్.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


