పుష్పాలంకరణలో పైడితల్లి | - | Sakshi
Sakshi News home page

పుష్పాలంకరణలో పైడితల్లి

Jun 18 2025 3:07 AM | Updated on Jun 18 2025 3:07 AM

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆల య సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరా వు, తాళ్లపూడి ధనుంజయ్‌, నేతేటి ప్రశాంత్‌ శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసు పు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆరు నెలల్లో ‘జల్‌ జీవన్‌’ పూర్తి

బొబ్బిలి: మరో ఆరు నెలల్లో జిల్లా వ్యాప్తంగా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను పూర్తి చేయను న్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎస్‌.కవిత తెలిపారు. మంగళవారం ఆమె బొబ్బిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయనను కలసి నియోజకవర్గంలో మంజూరై న పనులు పూర్తయిన పనుల వివరాలను తెలియజేశారు. పెండింగ్‌ పనులకు సంబంధించి స్థానిక డీఈ, జేఈలకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు

విజయనగరం ఫోర్ట్‌: వైద్య ఆరోగ్య శాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీల కోసం మంగ ళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డీఎంహెచ్‌వో డాక్ట ర్‌ ఎస్‌.జీవనరాణి, ఏవో ప్రభాజీ, సూపరింటెండెంట్‌ నాగరాజు కౌన్సెలింగ్‌ నిర్వహించా రు. జూనియర్‌ అసిస్టెంట్స్‌– 4, ఆపీస్‌ సబార్డినేట్స్‌ 14 మందికి, తోటీలు–1, డ్రైవర్లు – 7, టైపిస్టులు – 2, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ గ్రేడ్‌ – 2 ఐదుగురికి, ఎఫ్‌ఎన్‌వోలు ఇద్దరికి, ఎంఎన్‌వో ఒకరికి, స్వీపర్‌ ఇద్దరికి బదిలీ అయింది. ఈ నెల 23వ తేదీలోగా వారికి కేటాయించిన స్థలా ల్లో చేరాలని సూచించారు.

రాష్ట్రంలో క్షీణించిన

శాంతిభద్రతలు

నెల్లిమర్ల రూరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించాయని ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా చిన్నారులు, మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టి దాడి చేయడం అమానుషమన్నా రు. దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

21న జాబ్‌మేళా

గుమ్మలక్ష్మీపురం: స్థానిక ప్రభుత్వ ఆర్‌ఐటీఐ వద్ద ఈ నెల 21న హైదరాబాద్‌కు చెందిన శ్రీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ ఎం.గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలోని ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వెల్డర్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికల్‌ మరియు కోపా ఉత్తీర్ణత పొందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు జాబ్‌మేళాకు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో ఆ రోజు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9491134464 నంబరుకు సంప్రదించాలలని ఆయన సూచించారు.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఎంహెచ్‌వో

జీవనరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement