విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Jun 18 2025 3:07 AM | Updated on Jun 18 2025 3:07 AM

విజయన

విజయనగరం

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2025

ప్రతి మహిళ లక్షాధికారి కావాలి

మన్యం జిల్లాలోని ప్రతి మహిళా లక్షాధికారి కావాలని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారి శ్రామికవేత్త వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. 8లో

ప్రజారోగ్యానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి

ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని అక్షరాలా.. అమలు చేసి చేతల్లో చూపించారు.

అందులో భాగంగానే నాడు – నేడు ద్వారా ఆసుపత్రుల రూపురేఖలు కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దారు. జీరో వేకేన్సీ పాలసీ ద్వారా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేశారు. తద్వారా ప్రజారోగ్యమే మహాభాగ్యమన్నట్టు పాలన చేసి చూపించారు. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యం పట్ల నిండా అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో ప్రజారోగ్యం

ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఫలితంగా అనారోగ్యానికి గురైన ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

విజయనగరం ఫోర్ట్‌:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వైద్య రంగ చరిత్రలో ఎన్నడు లేని విధంగా జీరో వేకేన్సీ పాలసీ తీసుకొచ్చి ఆసుపత్రుల్లో ఏర్పడ్డ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసింది. ఆసుపత్రులను నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసింది. ఏళ్ల తరబడి అప్‌గ్రేడేషన్‌ కు నోచుకోని సామాజిక ఆసుపత్రులను అప్‌గ్రేడేష న్‌ చేసింది. వాటికి అవసరమైన అదనపు భవనాల ను కూడా మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగం పట్ల చిన్న చూపు చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏరియా ఆసుపత్రు లు, సామాజిక ఆరోగ్య కేంద్రాల పట్ల అలసత్వం వహిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీవీపీకి చెందిన ఐదు ఆసుపత్రులకు

భవనాల మంజూరు

వైద్య విధాన్‌ పరిషత్‌ పరిధిలోని ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలకు ఐదింటికి అదనపు భవనాలను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం రూ.కోట్లు నిధులు కేటాయించింది. గజపతినగరం సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడేషన్‌ చేసింది. ఇందుకోసం అదనపు భవనాల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేసింది. ఎస్‌.కోట సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిగా మార్చి 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడేషన్‌ చేశారు. అదనపు భవనాల నిర్మాణం కోసం రూ.12.60 కోట్లు మంజూరు చేశారు. బాడంగి సీహెచ్‌సీని 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడేషన్‌ చేశారు. ఇందు కోసం రూ.8.81 కోట్లు అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసింది. సీహెచ్‌సీ భోగాపురం అధునీకరణకు రూ. 3.95 కోట్లు మంజూరు చేసింది. నెల్లిమర్ల సీహెచ్‌సీ 30 పడకల ఆసుపత్రి ఆధునీకరణ, భవనాల నిర్మాణం కోసం రూ.4.42 కోట్లు మంజూరు చేశారు.

న్యూస్‌రీల్‌

సీహెచ్‌సీ భవనాల నిర్మాణంలో నిండా నిర్లక్ష్యం

గడువు ముగిసినా పూర్తి కాని వైనం

జిల్లాలో ఐదు ఆసుపత్రులకు అదనపు భవనాల మంజూరు

2020లో భవనాలు మంజూరు చేసిన అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

2025 మార్చి నాటికి పూర్తి కావాల్సిన భవనాలు

ఇంకా పూర్తి కాని వైనం

మంజూరైన నిధులు రూ.46.78 కోట్లు

2020లో అదనపు భవనాల మంజూరు

బిల్లుల సమస్యతో

కాస్త ఆలస్యం

మార్చి 2025 నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. బిల్లుల సమస్య వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసమూర్తి, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ

2020లో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆసుపత్రులను అప్‌గ్రేడేషన్‌ చేయడంతో పాటు అప్‌గ్రేడేషన్‌కు తగ్గట్టుగా వసతులు కల్పన, అదనపు భవనాలు నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసింది. భవనాల నిర్మాణం, ఆధునీకరణ పనులను 2025 మార్చి నెలఖారు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే గడువు దాటి మూడు నెలలు అయినా ఒక ఆసుపత్రి మినహా మిగిలిన నాలుగు ఆసుపత్రుల భవనాలు ఇంకా పూర్తి కాలేదు.

భోగాపురం ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయింది. గజపతినగరం, ఎస్‌.కోట, నెల్లిమర్ల, బాడంగి ఆసుపత్రుల నిర్మాణం పూర్తి కాలేదు. ఆసుపత్రుల్లో సేవలు ఎందుకు పూర్తి స్థాయిలో అందడం లేదని వైద్యులను ఆ శాఖ ఉన్నతాధికారులు అడిగితే వసతులు లేక సేవలు అందించలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక భవనాల నిర్మాణం మందగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయనగరం1
1/5

విజయనగరం

విజయనగరం2
2/5

విజయనగరం

విజయనగరం3
3/5

విజయనగరం

విజయనగరం4
4/5

విజయనగరం

విజయనగరం5
5/5

విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement