త్వరలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ | - | Sakshi
Sakshi News home page

త్వరలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ

Jun 18 2025 3:07 AM | Updated on Jun 18 2025 3:07 AM

త్వరలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ

త్వరలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి

విజయనగరం అర్బన్‌: పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నామని, దీనికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని జిల్లా రెవె న్యూ అధికారి ఎస్‌.శ్రీనివాసమూర్తి కోరారు. రాజకీ య పార్టీల ప్రతినిధులతో డీఆర్‌వో తన చాంబర్‌ లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలను హేతుబద్ధీకరించడానికి ఇదే తగిన సమయమని అన్నారు. పాత భవనాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను కొత్త భవనాల్లోకి మార్చడానికి అదనంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు, కేంద్రాల్లో మా ర్పు చేర్పులకు, ఒకచోట నుంచి మరో చోటుకు తరలించడానికి అవకాశం ఉందన్నారు. అదే విధంగా 1200 కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట అదనంగా మరో పోలింగ్‌ కోంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ఈ విధంగా జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలి లో 26, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 17, విజయనరగం 61, ఎస్‌.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 138 పోలింగ్‌ కేంద్రా ల్లో 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని తెలిపా రు. పోలింగ్‌ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 30వ తేదీలోగా రాజకీయ పార్టీల నుంచి ప్రతిపాదనలను అందజే యాలని కోరారు. సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ భాస్కరరావు, ఇతర సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులు వర్రి నర్సింహమూర్తి, శ్రీనివాసరెడ్డి, సతీష్‌కుమార్‌, సీహెచ్‌ అప్పారావు, సోములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement