
యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
● జిల్లా ఇంచార్జ్ మంత్రి
విజయనగరం అర్బన్: విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, రహదారుల భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్రెడ్డిలతో కలసి సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు యోగాను రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. విశాఖలో ఒకే రోజున ఒకే వేదిక నుంచి 5 లక్షల మంది యోగ చేయడం ద్వారా దేశ మంతా వైజాగ్ వైపు చూస్తుందన్నారు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదిస్తామని పేర్కొన్నారు. నియోజ కవర్గం వారీగా.. సచివాలయం వారీగా నమోదు చేసుకున్న జాబితాలను సంబంధిత ఎమ్మెల్యేలకు ఇవ్వాలని వారు వారి కార్యకర్తల ద్వారా జన సమీకరణలో భాగస్వామ్యులవుతారని తెలిపారు. కలెక్ట ర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ జిల్లా నుంచి 36 వేల మందిని సిద్ధం చేసుకున్నామని కనీసం 30 వేల మందిని పంపడానికి రెండు రూట్లలో 660 బస్సులను సిద్ధం చేశామన్నారు. ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని నియమించామని, సచివాలయం వారీగా బస్సులను, టాయిలెట్ల ను మాప్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా 15 వేల మంది హాస్టల్ విద్యార్థులను పంపడాని కి కళాశాలలతో ప్రణాళిక రూపొందించామన్నారు. మిగిలిన వారిని డీఆర్డీఏ, మెప్మాల ద్వారా సమీకరిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ వర్మ, ఎమ్మెల్యేలు పి.అదితి విజయలక్ష్మి, లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ బంగార్రాజు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, గొంప కృష్ణ, డీఆర్డీఏ కల్యాణచక్రవర్తి, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.