
స్థానిక సంస్థలపై..
ఎయిర్పోర్ట్ కోసం
మీరేం చేశారో చెప్పండి..?
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారో చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని అడ్డంకులు తొలగించి జీఎంఆర్ సంస్థ పర్యవేక్షణలో ఎల్అండ్టీ సారథ్యంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 23 శాతం పనులు పూర్త్తయినట్లు స్వయానా ప్రస్తుత కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రకటించారు. అడ్డంకులు ఉంటే నిధులు మంజూరయ్యేవా...? టెండర్ దక్కించుకున్న వారు పనులు ప్రారంభించగలరా...? అంతా తామే చేస్తున్నట్లు ప్రకటనలు చేసుకుంటున్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ఎయిర్పోర్ట్ కోసం ఒక్క కొత్త అనుమతైనా తీసుకువచ్చారా...? మిగులు రైతుల సమస్యలు పరిష్కరించారా...? మౌలిక వసతుల కల్పనపై కనీసం దృష్టి సారించారా? అన్న ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలి.
● 11 నెలల పాలనలో సాధారాణ నిధులు ఒక్కరూపాయి కూడా విడుదల చేయని వైనం
● మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు
● కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజా పోరాటం చేస్తాం
● మత్స్యకారులకు రెండేళ్లకు రూ.40వేలు చొప్పున భృతి ఇవ్వాల్సిందే
● ఉపాధి వేతన బకాయిల చెల్లింపులో నిర్లక్ష్య ధోరణి
● బీసీ రుణాల మంజూరులో రాజకీయ జోక్యం తగదు
● కూటమి హయాంలో భోగాపురం
ఎయిర్పోర్ట్ కోసం చేసిందేంటి..?
● జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
వెనుకబడిన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంజూరు చేసే రుణాల విషయంలో కూటమి ప్రభుత్వం నిబంధనలు విడుదల చేయకపోవడం దారుణం. జిల్లా వ్యాపంగా 3,379 యూనిట్లు మంజూరు కాగా... జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో అర్హులైన 20,452 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఎవరిని అర్హులుగా గుర్తిస్తారన్న విషయంపై అధికార యంత్రాంగానికి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో గుర్ల ఎంపీపీ ఇదే విషయమై ప్రస్తావిస్తే.. స్థానిక ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేక తీసుకురావాలంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటు. గత ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా రుణాలు మంజూరు చేస్తే.. ఇప్పుడు పార్టీలే ప్రామణికంగా మంజూరు చేస్తారా..? కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హమీలకు, ప్రస్తుత పాలన తీరుకు పొంతన లేకుండా పోతోంది. ప్రభుత్వ పాలనపై ప్రజా తిరుగుబాటు తప్పదు.
విజయనగరం:
నిధులు లేక స్థానిక సంస్థలు నీరసిస్తున్నాయని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, పంచాయతీలకు సాధారణ నిధుల విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థలపై చిన్నచూపు తగదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మాటల గారెడీతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కూటమి నేతలు నేడు ప్రజా సమస్యలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించి స్థానిక సంస్థలకు రావాల్సిన సాధారణ నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ మేరకు మంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు. జిల్లా ప్రజల సమస్యలపై చర్చించేందుకు, పరిష్కారం చూపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ సమావేశాలకు గైర్హాజరు కావడంతో ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలన తీరు, హామీలు అమలుచేయకపోవడం, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకపోవడాన్ని మీడియా సాక్షిగా తెలియజేశారు. ఆయన మాటల్లోనే...
రుణాల
మంజూరుకు
నిబంధనలేవి?
పింఛన్లు మంజూరులో మాటల గారెడీ ఎందుకు...?
60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులకు, భర్తను కోల్పోయిన వితంతువులకు, దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయకుండా సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఇటీవల భర్తలు కోల్పోయిన వితంతువులకు మినహా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరయ్యేవి. 2023 డిసెంబర్ వరకు అర్హులందరికీ న్యాయం చేశారు. వాస్తవానికి గతేడాది జూన్ నెలలో అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి సచివాలయాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సుమారు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంఖ్య ఇప్పటికి 15 వేలకు పైగా పెరుగుతందని అంచనా. ఒక్క చీపురుపల్లిలో 330 మంది పింఛన్ కోసం ఇటీవల రోడ్డెక్కి నిరసన చేపట్టిన పరిస్థితులే దీనికి తార్కాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 65.49 పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా... ప్రస్తు తం ఆ సంఖ్య 63.92 లక్షలకు తగ్గింది. అర్హులకు పింఛన్లు మంజూరు కోసం పార్టీ అధిష్టానం సూచనల మేరకు పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబ డడం, సంక్షేమానికి కృషిచేయడంలో వైఎస్సార్సీపీ బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపిస్తాం.
వేతనదారులు గగ్గోలు పెడుతున్నా..
ఉపాధిహామీ వేతనదారులకు 13 వారాలుగా వేతన బకాయిలు చెల్లించకపోయినా ప్రభుత్వం, ప్రజాప్రతినినధులు పట్టించుకోకపోవడం దారుణం. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వలస నివారణకు ఉపాధి హమీ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. సగటున రోజుకు ఒక్కో వేతనదారునికి కనీసం రూ.307 వేతనం గిట్టుబాటేయ్యేలా చూడాలి. చాలా ప్రాంతాల్లో రూ.50 నుంచి రూ.100 మాత్రమే గిట్టుబాటు అవుతుండడం దారుణం. తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలి.
మత్స్యకారులకు రెండేళ్ల భృతి ఇవ్వాల్సిందే...
ఏడాదిలో 60 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధించే సమయంలో ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు అందించాల్సిన వేటనిషేధ భృతిని రెండేళ్ల కాలానికి రూ.40వేల చొప్పున అందించాలి. అర్హులైన 3,798 మంది మత్స్యకారులుకు న్యాయం చేయాలి. ఎన్నికల్లో ఒకలా.. ఇప్పు డు ఒకలా మాట్లాడడం తగదు. హామీ మేరకు ఏడాదికి రూ.20వేల చొ ప్పున ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం ఏటా ఠంచన్గా మత్స్యకార భృతి అందించింది. రాయితీలు కల్పిస్తూ ఆదుకుంది.
అన్నింటా విఫలం
పరిశ్రమలు తీసుకువస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నేతలు ఎన్నికలకు ముందు హమీలు గుప్పించారు. ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లాలో జిందాల్ పరిశ్రమ మూతబడింది. కార్మికులు రోడ్డున పడ్డారు. దీనికి కూటమినేతలు ఏమని సమాధానం చెబుతారని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నర్సింహమూర్తి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థలపై..

స్థానిక సంస్థలపై..

స్థానిక సంస్థలపై..

స్థానిక సంస్థలపై..

స్థానిక సంస్థలపై..