డాబాగార్డెన్స్: ఇంటర్ ఫలితాల్లో రామబాణం కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీలో ఎస్.లక్ష్మీప్రియ 467 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. లక్ష్మీప్రియను కళాశాలల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ అభినందించారు. విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయడమే తమ అకాడమీ లక్ష్యమన్నారు. 104 ఏరియా, మర్రిపాలెం, ఆశీల్మెట్ట, గాజువాక, హైదరాబాద్ ప్రాంతాల్లోని తమ బ్రాంచ్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారని తెలిపారు.


