
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు
మహారాణిపేట: వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో భాగంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ, కేజీహెచ్లో మొత్తం 43 మందిని బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్లు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ లోకనాథం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. 12 మంది ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా స్థాన చలనం కలిగింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 330 మందిని బదిలీ చేశారు. ఈ మేరకు ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధాకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 250 మంది స్టాఫ్ నర్సులు, 80 మంది హెడ్ నర్సులు బదిలీ అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో ఐదు కేడర్లలో 60 మంది స్థాన చలనం పొందారు.