
ప్రతి గడపకూ సంక్షేమం
● పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
మోమిన్పేట: వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 7వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. శు క్రవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో 312 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, 27 మందికి కల్యాణలక్ష్మి, షా దీముబాక్ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎన్నికల హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నట్లు పే ర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నాలుగు దశల్లో నిర్మాణ బిల్లులు రూ.5 లక్షలు జమ చేస్తామని వివరించారు. పేదలు కడుపునిండా అన్నం తినాలనే మంచి ఆశయంతో దేశంలోనే మొదటి సారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఐదు ఎకరాల వరకు రైతు భ రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అ వుతోందని తెలిపారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి నిధు లు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. త్వరలో పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరవుతాయని వివరించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రవీందర్, ఏఓ జయశంకర్, ఎంపీఓ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు శంకర్, నాయకులు సురేందర్, నరోత్తంరెడ్డి, మహంత్స్వామి, సిరాజొద్దీన్, నర్సింలు, విఠల్, మల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, మాణయ్య, రవి, వెంకటయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.
263 మందికి పత్రాలు
మర్పల్లి: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆకుల రాజేందర్ ఫంక్షన్ హాల్లో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్ కొండల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్రెడ్డితో కలిసి మండలంలోని 263 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మరో 40 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు ఇళ్లు మంజూరు చేసి వారి గుండెల్లో నిలిపోయారని గుర్తుచేశారు. అర్హలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, నాయకులు రాములు యాదవ్, సుభాష్ యాదవ్, ఖలీమొద్దీన్, శంకరయ్య గౌడ్, సంజీవరెడ్డి, గణేశ్, నాగేశ్, రవీందర్, ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రామేశ్వర్, సహకార సంఘం వైస్ చైర్మన్ ఫసి, మండల ప్రత్యేకాధికారి మోహన్కృష్ణ, తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ రాజ్మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.