బడిదుడుకులు | - | Sakshi
Sakshi News home page

బడిదుడుకులు

Jun 21 2025 7:24 AM | Updated on Jun 21 2025 7:24 AM

బడిదుడుకులు

బడిదుడుకులు

సమస్యలకు నిలయంగా సర్కారు స్కూళ్లు
● పెచ్చులూడుతున్న భవనాలు ● కొరవడిన శుభ్రత, ప్రహరీల కరువు ● జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,063 ● విద్యార్థులు 80వేల మంది

మర్పల్లి: అపరిశుభ్రంగా బూచన్‌పల్లి

పాఠశాల ఆవరణ

వికారాబాద్‌: పాఠశాలలు పునఃప్రారంభమై వారం గడిచినా ఇంకా సమస్యలు కొలిక్కిరాలేదు. స్కూల్‌ భవనాలు, వసతుల కల్పన కోసం మన ఊరు – మన బడి, అమ్మా ఆదర్శ పాఠశాలలు పేరిట పనులు చేపట్టినా అనుకున్న మేర ఫలితం ఇవ్వలేదు. జిల్లా వ్యాప్తంగా 1,063 పాఠశాలలు ఉండగా ఇందులో 80వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 187 బడుల్లో వివిధ మరమ్మతు పనులు అవసరమని అధికారులు తేల్చారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలలను ‘సాక్షి’ విజిట్‌ చేయగా అనేక సమస్యలు వెలుగు చేశాయి. అనేక బడుల్లో పెచ్చులూడుతున్న పైకప్పులు కనిపించాయి. ప్రహరీలు లేకపోవడం, మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రతంగా దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేవు. చెడిపోయిన ట్యాప్‌లు కనిపించాయి. గేట్లు లేకపోవడంతో స్కూల్‌ వదిలాక ఆకతాయిలు చేరి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. పాఠశాలల ఆవరణల్లో గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.

– వివరాలు 11లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement