నేడు వికారాబాద్‌లో యోగా డే | - | Sakshi
Sakshi News home page

నేడు వికారాబాద్‌లో యోగా డే

Jun 21 2025 7:24 AM | Updated on Jun 21 2025 7:24 AM

నేడు

నేడు వికారాబాద్‌లో యోగా డే

అనంతగిరి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వికారాబాద్‌ పట్టణంలోని బ్లాక్‌ గ్రౌండ్‌లో యోగా డే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ హాజరుకానున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

నేడు బంట్వారానికి

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక

బంట్వారం: మండల కేంద్రానికి శనివారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ రానున్నట్లు ఎంపీడీఓ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కోట్‌పల్లిలో పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కోట్‌పల్లి ఎంపీడీఓ డానియల్‌ తెలిపారు.

డయల్‌ యువర్‌ డీఎం నేడు

తాండూరు: తాండూరు ఆర్టీసీ డిపోలో శనివారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్‌ సురేష్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10నుంచి 11 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

బాధితులకు

సెల్‌ఫోన్ల అప్పగింత

యాలాల: పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. మండలంలోని దేవనూరుకు చెందిన మెట్లి కృష్ణ, హాజీపూర్‌కు చెందిన ఇస్మాయిల్‌, మెట్లకుంటకు చెందిన బాల్‌రాజ్‌ ఇటీవల తమ సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నారు. యాలాల పీఎస్‌లో ఫి ర్యాదు చేశారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఫో న్లను గుర్తించి స్వాధీనం చేసుకొని శుక్రవారం బాధితులకు అందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కల్యాణ మండప

పునర్నిర్మాణానికి సహకరిస్తా

తాండూరు: వీరశైవ సమాజం సభ్యుల కోసం నిర్మించిన కల్యాణ మండపం అగ్ని ప్రమాదానికి గురి కావడం బాధాకరమని మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్‌ సంపత్‌కుమార్‌తో కలిసి ప్రమాదానికి గురైన మండపాన్ని సందర్శించి అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మండప పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీర శైవ సమాజం అధ్యక్షుడు ఆర్‌ బస్వరాజ్‌, గౌరవాధ్యక్షుడు వాలి శాంతుకుమార్‌, నాయకులు టీ చంద్రశేఖర్‌, గణపురం శంకర్‌, ఎన్‌ చంద్రశేఖర్‌, రాజశేఖర్‌, కాంగ్రెస్‌ నాయకుడు రఘు తదితరులు పాల్గొన్నారు.

27నుంచిధ్రువపత్రాల పరిశీలన

అనంతగిరి: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం షెడ్యూల్‌ విడుదలైనట్లు వికారాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవీందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ముందుగా కౌన్సిలింగ్‌ రుసుం చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు స్లాట్‌ రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్‌ కార్డు, ఒరిజినల్‌ ఎస్‌ఎస్‌సీ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కెట్లు, టీసీ, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నేడు వికారాబాద్‌లో  యోగా డే 
1
1/1

నేడు వికారాబాద్‌లో యోగా డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement