
‘నీట్, ఐఐటీ’కి సన్నద్ధం చేయండి
● జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్
పరిగి: ఇంటర్ విద్యార్థులను నీట్, ఐఐటీ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్ సూచించారు.శుక్రవారం పరిగి పట్టణం తుంకుల్గడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా లో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకుందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్య తోపాటు స్కాలర్షిప్ సదుపాయం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల కంటే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయా లు తెలియజేసి కళాశాలలో చేర్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్, అధ్యాపకులు భాస్కర యోగి, రాజ్కుమార్, సతీష్, వరస్వామి, గోపాల్, ప్రభాకర్, రవి, వెంకటేశ్, గణేశ్, బాలగణేశ్, మమత పాల్గొన్నారు.