కొడంగల్‌ మున్సిపల్‌కు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

కొడంగల్‌ మున్సిపల్‌కు మహర్దశ

Jun 21 2025 7:24 AM | Updated on Jun 21 2025 7:24 AM

కొడంగ

కొడంగల్‌ మున్సిపల్‌కు మహర్దశ

● రూ.300 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ● అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపనలు ● సుందరంగా మారనున్న పట్టణం

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపాలిటీకి మహర్దశ ప ట్టింది. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తాజాగా శుక్రవారం కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బాలరాం నాయక్‌ తెలిపారు. పట్టణంలో ని వినాయక చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ నున్నట్లు తెలిపారు.తాగునీటి సరఫరాకు రూ.2.50 కోట్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.66. 72 కోట్లు, వర్షపు నీటి పారుదల వ్యవస్థకు రూ.57. 67 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థకు రూ. 7.09 కోట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.78 కోట్లు, ఇతర ఖర్చులు రూ.66.50 కోట్లు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు రూ.6.67 కోట్లు మంజూరు చేశారు.

అభివృద్ధిలో ఆదర్శం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గా న్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 వేల కోట్ల తో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం కొడంగల్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు చేశారు.కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తాం. – నందారం ప్రశాంత్‌, పార్టీ మండల అధ్యక్షుడు, కొడంగల్‌

కొడంగల్‌ మున్సిపల్‌కు మహర్దశ1
1/1

కొడంగల్‌ మున్సిపల్‌కు మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement