నేడు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Jun 19 2025 7:56 AM | Updated on Jun 19 2025 7:56 AM

నేడు

నేడు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

దుద్యాల్‌: విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఎంఈఓ విజయ రామారావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2024–2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన ఉత్తమ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో మొదటి, ద్వితీయ పురస్కారాలు అందిస్తామని చెప్పారు. మండలంలో కుదురుమల్ల, దుద్యాల్‌, హకీంపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరు కావాలని సూచించారు.

పాము, కుక్క కాటుకు

మందులు

హకీంపేట్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ వందన

దుద్యాల్‌: పాము, తేలు, కుక్క కాటుకు హకీంపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్‌ వందన తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక పీహెచ్‌సీలో ప్రభుత్వం అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో రైతులు అధికంగా పొలం పనులకు వెళ్తుంటారన్నారు. చలువతో పాము, తేలు కాటుకు గురవుతుంటారు. అలాంటి బాధితులకి పీహెచ్‌సీలో చికిత్స అందుతుందని పేర్కొన్నారు.

20 క్వింటాళ్ల

రేషన్‌ బియ్యం పట్టివేత

బొంరాస్‌పేట: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సన్నబియ్యం పక్కదారి పడుతోంది. తప్పుడు లెక్కలతో సన్నబియ్యం పోగు చేసుకొని అక్రమదందాకు ఒడిగడుతున్నారు. బుధవారం తాండూరుకు చెందిన వడ్ల మోహన్‌ బొలేరో వాహనంలో సన్నబియ్యంతో వెళ్తుండగా స్థానిక పోలీసులు పట్టివేశారు. సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ అబ్దుల్‌ రవూఫ్‌ తెలిపారు.

నేడు విద్యార్థులకు  ప్రతిభా పురస్కారాలు 1
1/1

నేడు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement