కమ్మేసిన పొగమంచు | - | Sakshi
Sakshi News home page

కమ్మేసిన పొగమంచు

Jun 17 2025 6:59 AM | Updated on Jun 17 2025 6:59 AM

కమ్మే

కమ్మేసిన పొగమంచు

ధారూరు: మండల కేంద్రంలో సోమవారం పొగమంచు ప్రజల్ని, ప్రయాణికులను ఇబ్బందుల పాలుచేసింది. పొలాలను సైతంపొగమంచు ఆవరించింది. రోడ్లను కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది.

విద్యార్థులకు

వేడి భోజనం అందించాలి

సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బలక్ష్మి

మోమిన్‌పేట: విద్యార్థులకు నిత్యం వేడి భోజ నం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బలక్ష్మి ఆదేశించారు. సో మవారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నిత్యం వేడిగా రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. హాస్టల్‌ పరిసరాలు, గదులు, కిచెన్‌ షెడ్డును శుభ్రంగా ఉంచుకో వా లని సూచించారు. పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులను కనిపెట్టుకొని ఉండాలని, రోజూ పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూ శుక్ర వర్ధన్‌రెడ్డి, హెచ్‌ఓ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

స్పెషల్‌ ఆఫీసర్‌ పల్లవిరెడ్డి

బంట్వారం: కోట్‌పల్లి కేజీబీవీ జూనియర్‌ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్‌ ఆఫీసర్‌ పల్లవీరెడ్డి సోమవారం తెలిపారు. ఇంగ్లిష్‌ లెక్చరర్‌ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ 1,ఎంఎల్టీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వికారాబాద్‌ జిల్లా నివాసులై ఉండాలన్నారు. మెరిట్‌, డెమో, ఆయా విభాగాల్లో సంవత్సరం పాటు బోధన చేసిన అనుభవం ఉండాలన్నా రు. తాత్కాలిక పద్ధతిని నియమించడం జరు గుతుందన్నారు.ఆసక్తి గల మహిళా అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌ ఫొ టోలు, ఇతర ధ్రువ పత్రాలతో ఈ నెల 18వ తేదీలోపు కోట్‌పల్లి కేజీబీవీలో సమర్పించాలన్నారు. మిగతా వివరాలకు సెల్‌ నంబర్‌ 8328 415565ను సంప్రదించాలని సూచించారు.

19న ప్రవేశ పరీక్ష

కుల్కచర్ల: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎంఈఓ హబీబ్‌ అహ్మద్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2025 –26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం కుల్కచర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌ రాయాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ లేదా పీఈటీ ప్రవీణ్‌ సెల్‌ నంబర్‌ 9948640187లో సంప్రదించాలని సూచించారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

అనంతగిరి: వికారాబాద్‌లో సోమవారం న్యా యవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈనెల 14న హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సంబంధించిన న్యాయవాదులు నారాయణ, శైలేష్‌ సక్సేనాలపై దాడి ఘటనను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూలి బస్వరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు మాధవరెడ్డి, ఆనంద్‌, శంకరయ్య, కమాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, లవకుమార్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కమ్మేసిన పొగమంచు
1
1/3

కమ్మేసిన పొగమంచు

కమ్మేసిన పొగమంచు
2
2/3

కమ్మేసిన పొగమంచు

కమ్మేసిన పొగమంచు
3
3/3

కమ్మేసిన పొగమంచు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement