ప్రభుత్వ బడులను ఆదరిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడులను ఆదరిద్దాం

Jun 17 2025 6:59 AM | Updated on Jun 17 2025 6:59 AM

ప్రభుత్వ బడులను ఆదరిద్దాం

ప్రభుత్వ బడులను ఆదరిద్దాం

● కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ● వికారాబాద్‌లో బడిబాట కార్యక్రమం

అనంతగిరి: తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. సోమవారం వికారాబాద్‌లోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయు లు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎల్‌ ఎన్‌, ఎల్‌ఐపీ కార్యక్రమాలను జ్యోతి ప్రజల్వ న చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువు చెప్పే ఉపా ధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఐపీ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల ని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్య క్రమం ద్వారా విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు దోహదం చేస్తుందని వివరించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలు తారబాయిని గుర్తు చేసుకున్నారు. ఆమె చదువు చెప్పడంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొ న్నా రు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూ చించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫా మ్స్‌, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన టీఎల్‌ఎం స్టాల్స్‌ను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి బాబుసింగ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం, ఎస్‌ఎంసీ చైర్మన్‌ విజయలక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పథకాలు ప్రజలకు అందేలా చూడాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బడిబాట కార్యక్రమం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మండల అధికారులకు సూచించారు. రేషన్‌ దుకాణాల్లో మూడు నెలల సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ సమస్యల పరిష్కా రం కోసం 84 దరఖాస్తులు వచ్చాయని తెలిపా రు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్‌, సుధీర్‌, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement