
కేంద్ర పథకాలతో నిరుపేదలకు మేలు
కందుకూరు: కేంద్రంలో ఏన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలు నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్, కడారి జంగయ్యయాదవ్, మండల ఇన్చార్జి పోరెడ్డి అర్జున్రెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, జిల్లా నాయకులు జిట్టా రాజేందర్రెడ్డి, పి.శ్రీనివాస్గౌడ్, ఎస్.మల్లారెడ్డి. ఎ.సత్తయ్య, ఎన్.నర్సింహారెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.