కలెక్టర్‌ పాలన.. విజయ పథాన | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ పాలన.. విజయ పథాన

Jun 16 2025 7:19 AM | Updated on Jun 16 2025 7:19 AM

కలెక్టర్‌ పాలన.. విజయ పథాన

కలెక్టర్‌ పాలన.. విజయ పథాన

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. బొంరాస్‌పేట–బుర్రితండా డబుల్‌ రోడ్డు నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

8లోu

9లోu

వికారాబాద్‌: ఓ పక్క సంక్షేమ పథకాలను ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల వద్దకు చేర్చడంతో పాటు మరో పక్క పాలన గాడిన పెట్టడంలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ చాలా వరకరు సక్సెస్‌ అయ్యారు. మొదటిసారి వికారాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. చివరకు తేరుకుని పాలన గాడిలో పెట్టారు. నేటితో ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుండటంతో జిల్లాపై ఆయన వేసిన ముద్ర ఎదుర్కొన్న సమస్యలు, లోటుపాట్లపై ఓ పరిశీలిద్దాం..

అధికార యంత్రాంగం పనితీరుపై..

జిల్లాలో ప్రధానంగా కలెక్టరేట్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కంకణం కట్టుకున్న కలెక్టర్‌ వచ్చీ రాగానే అన్ని శాఖల యంత్రాంగం సేవలు ప్రజలకు అందడంలో ఇబ్బందులు, జాప్యంలేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి జిల్లా అధికారుల వరకు అన్ని శాఖల యంత్రాంగం పనితీరును మెరుగపరిచేందుకు తీసుకున్న చర్యలు సత్ఫాలితాలిచ్చినట్లే కనిపిస్తున్నాయి. తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణను బలోపేతం చేయటంలోనూ సఫళీకృతమయ్యారు. ధరణి నుంచి భూ భారతి సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతూ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్నారు.

4,500 ధరణి సమస్యలు పరిష్కారం

జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న ధరణి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు తీసుకున్నది మొదలు రోజుకు 150 సమస్యలకు తక్కువ కాకుండా ధరణి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయటంతో పాటు సేవలు మెరుగుపర్చారు. ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో మండల స్థాయిలో తహాసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వస్తున్నారు. సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. 5 వేల వరకు ఉన్న ధరణి దరఖాస్తులు నేడు 400లోపే వచ్చాయి.

విద్య, వైద్యంపై స్పెషల్‌ ఫోకస్‌

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించంలో తనదైన ముద్ర వేశారు. ప్రతీ హాస్టల్‌కు తనే స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నిధులు కేటాయించి వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆస్పత్రులను తరచూ విజిట్‌ చేస్తూ వైద్య సేవలు అందరికి అందేలా చొరవ చూపారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేశారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై దృష్టి సారించి ప్రజలకు అందించడంలో ప్రత్యేక చొరవ చూపారు.

భూసేకరణలో సక్సెస్‌

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో ఆయనతో పాటు ఇతర అధికారులు, పోలీసులపై జరిగిన దాడి ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ ఘటన నుంచి సాధ్యమైనంత తొందరగానే బయటపడిన ఆయన తిరిగి పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించే విషయంలో సక్సెస్‌ అయ్యారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా చూడడంలో ఆయన శ్రమ ఫలించింది.

ప్రతీక్‌జైన్‌ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి

సంక్షేమం దిశగా పరుగులు పెట్టించేందుకు తనదైన మార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement