
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మున్సిపల్ మాజీ చైర్మన్
కొడంగల్: మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మార్యద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసానికి వెళ్లి కొడంగల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. భారీ మొత్తంలో నిధులతో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
నీట్లో సత్తాచాటిన మండల విద్యార్థి
జాతీయ స్థాయిలో 660 ర్యాంక్ సాధించిన హరీష్
యాలాల/తాండూరు టౌన్: నీట్ ఫలితాల్లో మండల విద్యార్థి సత్తాచాటారు. బెన్నూరు గ్రామానికి చెందిన కరణం లక్ష్మీకాంతరావు, విద్యారాణి దంపతుల కుమారుడు కరణం హరీష్ గౌతం గత మేలో నిర్వహించిన నీట్ జాతీయ స్థాయి అర్హత పరీక్షలకు హాజరయ్యాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 660వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 416వ ర్యాంకు సాధించారు. నీట్ పరీక్షలో అన్ని సబ్జెక్టుల్లో 99శాతం ఉత్తీర్ణతతో హరీష్ మార్కులు సాధించడం విశేషం. హరీష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. టీపీయూఎస్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. నీట్లో ప్రతిభ చాటిన హరీష్కు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.
రక్త దానం ప్రాణదానంతో సమానం
తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్
తాండూరు టౌన్: రక్తదానం ప్రాణ దానంతో సమానమని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో కేక్ కట్ చేసి, రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో, అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో కావాల్సిన రక్త గ్రూపు లేక పోవడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన రక్తనిఽధి కేంద్రంలో యువత, పెద్దలు రక్తదానం చేసి రక్త నిల్వలను పెంచాలన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యకరమైన అంశమని, అలాగే ఇతరులు ప్రాణాలను నిలబెట్టిన వార వుతారన్నారు. కార్యక్రమంలో వైె ద్యులు ఆనంద్ గోపాల్ రెడ్డి, రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధారూరు మార్కెట్కు 2,358 బస్తాల మక్కలు
ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్కు శనివారం 2,358 బస్తాల మొక్కజొన్నలు వచ్చాయని ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. బీట్లలో వ్యాపారులు క్వింటాలు మొక్కజొన్నలకు తక్కువగా రూ.2,140, మధ్యస్తంగా రూ.2,170 ఎక్కువగా రూ.2,290 వరకు ధర పలికిందని తెలిపారు. 1010 రకం ధాన్యం 1,045 బస్తాలు రాగా క్వింటాలుకు రూ.1,870, రూ.1,880, రూ.1,950 వరకు, సోనారకం వడ్లు 291 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,050, రూ.2,100, రూ.2,150 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని ఆమె వివరించారు.

సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మున్సిపల్ మాజీ చైర్మన్

సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మున్సిపల్ మాజీ చైర్మన్