సమస్యలకు నిలయాలు.. ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు నిలయాలు.. ఆక్రమణలు

Apr 3 2025 7:53 PM | Updated on Apr 3 2025 7:53 PM

సమస్యలకు నిలయాలు.. ఆక్రమణలు

సమస్యలకు నిలయాలు.. ఆక్రమణలు

తాండూరు: మున్సిపల్‌ పరిధిలోని శ్మశాన వాటికలు సమస్యలకు నిలయంగా మారాయి. కనీస వసతులు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద వీరశైన సమాజానికి, బీసీలకు శ్మశాన వాటికలు ఉన్నాయి. బీసీ శ్మశాన వాటికలో వసతుల కల్పనకు ఐదేళ్ల క్రితం నిధులు మంజూరైనా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రస్తుతం పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో అధ్వానంగా మారింది. శ్మశానవాటిక ప్రాంగణంలోనే మలమూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ఆ సంఘం సభ్యులు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలోని శ్మశాన వాటిక స్థలాల ను ఆక్రమించి యథేచ్ఛగా దుకాణ సముదాయా లు నిర్మించారు. ప్రస్తుతం వాటిని అద్దెలకు కేటాయించి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీరశైవ సమాజం శ్మశాన వాటిక ప్రధాన రోడ్డుకు పక్కనే ఉంటుంది. ఆ స్థలాన్ని ఆక్రమించి 70 దు కాణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. అడ్వాన్స్‌ రూపంలో రూ.లక్షలు తీసుకుంటున్నారు. ప్రతినెలా ఒక్కో దుకాణానికి వేల రూపాయల అద్దె లు వసూలు చేస్తున్నారు.బీసీ శ్మశాన వాటిక పరి స్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ కూడా దుకా ణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. ముర్షద్‌ దర్గా వద్ద గల కబ్రస్థాన్‌స్థలంలో సైతం దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement