తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 63 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సీఎండీకి వివరించారు.
ముగిసిన జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: పాలేఖర్ కృషి విజ్ఞాన కేంద్రం, రైతు నేస్తం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీయూ బోటనీ విభాగం సహకారంతో ఐదు రోజులుగా జరిగిన ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహిత సుభాష్ పాలేఖర్ పాల్గొని విద్యార్థుల, వ్యవసాయ రంగ నిపుణల సందేహాల ప్రశ్నోత్తరాలను నివృతి చేశారు. అనంతరం సదస్సులో ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు, ఔత్సాహికులకు ధ్రువపత్రాలు అందజేశారు.


