
జిల్లా స్పోర్ట్స్ అధికారిగా శశిధర్
తిరుపతి కల్చరల్ : జిల్లా స్పోర్ట్స్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శశిధర్ను తిరుపతి ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయనను పలు క్రీడా సంఘాల ప్రతినిధులు కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అధికారి శశిధర్ మాట్లాడుతూ.. క్రీడా అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సత్కరించిన వారిలో ఒలపింక్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.ప్రవీణ్, కార్యదర్శి ఆర్.శ్రీధర్, కోశాధికారి సాయికుమార్, పుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డెప్ప, శాప్ కోచ్లు మాలిని, ఆది, ప్రేమ్, గోపి, హరి, హిందూజా ఉన్నారు.
న్యాయవాది కారులో రూ.లక్ష చోరీ
నాయుడుపేట టౌన్ : నాయుడుపేట న్యాయస్థానం సమీపంలో న్యాయవాది ఓల్లురు రాజమాణిక్యం కారును పార్కింగ్ చేసి రూ.లక్ష నగదును కారులో పెట్టి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి రూరల్ మండలం అవిలాల ఆంధ్రాబ్యాంక్ కాలనీకు చెందిన రాజమాణిక్యం తిరుపతి న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాయుడుపేట న్యాయస్థానంలో పనిమీద మంగళవారం నాయుడుపేట కోర్టుకు వచ్చారు. అతడి వద్ద ఉన్న రూ.లక్ష నగదు అతడి కారు డాష్ బోర్డులో పెట్టి లాక్ చేశారు. పని చూసుకుని తిరిగీ వచ్చే సరికే కారు అద్దాలు పగులు గొట్టి డాష్ బోర్డులో పెట్టిన రూ.లక్ష నగదు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దోపిడీ నిందితుడికి
రిమాండు
శ్రీకాళహస్తి : దోపిడీ కేసులో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతున్న నిందితుడు హేమంత్ను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. దోపిడీ కేసులో ఏఎం పుత్తూరుకు చెందిన హేమంత్కు అరెస్టు వారెంట్ను కోర్టు ప్రకటించగా అతడు కోర్టుకు హాజరు కాలేదన్నారు. దీంతో మంగళవారం పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.