
కోవిడ్పై అపమ్రత్తత
తిరుపతి తుడా : స్విమ్స్ యూనివర్శిటీ డైరెక్టర్ మీటింగ్ హాల్లో మంగళవారం ఆసుపత్రి అధికారులు కోవిడ్పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ అధికారులు, వైద్యులకు పలు సూచనలు చేశారు. స్విమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్ పేషెంట్లకు కావాల్సిన వైద్య సామగ్రి, బెడ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ పేషెంట్ల కోసం ప్రస్తుతం ఉన్న 6 బెడ్లను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు స్విమ్స్ వైద్యులు, సిబ్బంది ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించారని కొనియాడారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంత్ రే, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ, కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, డాక్టర్ రామకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, వైద్యులు పాల్గొన్నారు.
అర్హులకు గురుకుల సీట్లు
తిరుపతి అర్బన్ : గురుకుల పాఠశాలకు సంబంధించి అర్హులందరికీ సీట్లు కేటాయిస్తామని గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ (డీసీఓ) టి.పద్మజ వెల్లడించారు. మంగళవారం డీసీఓగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా డీసీఓగా పనిచేసిన ఆమె నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. విజయవాడ నుంచి గీత తిరుపతికి వచ్చారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో గీత మళ్లీ విజయవాడకు వెళ్లారు. పద్మజ నెల్లూరు నుంచి తిరుపతికి విచ్చేశారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి నిర్వహించిన పరీక్షల ఆధారంగా మార్కుల ప్రకారం గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేస్తున్నామని స్పష్టం చేశారు.
జాతీయ సాహస
పురస్కారాలకు దరఖాస్తులు
తిరుపతి కల్చరల్ : యువజన సర్వీసులు, క్రీడల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి టెన్జింగ్ నార్వే జాతీయ సాహస పురస్కారం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సీఈఓ మోహన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024లో ఏదైనా సాహస కృత్యంలో ప్రతిభ సాధించిన వారు ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. సంబంధిత దరఖాస్తులను వెబ్సైట్లో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. అంతేకాక వ్యక్తిగతంగా తమ దరఖాస్తులను సెట్విన్ కార్యాలయం, అలిపిరి రోడ్డు, చెన్నారెడ్డి కాలనీ, తిరుపతిలో జిల్లాలోని అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు అందజేయాలని, అయితే తప్పనిసరిగా ఆన్లైన్లో 30వ తేదీలోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 94405 73537ను సంప్రదించాలని కోరారు.

కోవిడ్పై అపమ్రత్తత