
ప్రీ స్కూల్ భవితకు పునాది
తిరుపతి సిటీ : బాల్యదశలో విద్యార్థులను క్రమశిక్షణతో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ప్రీ స్కూల్ టీచర్లదే ప్రధాన పాత్ర అని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పేర్కొన్నారు. పద్మావతి మహిళా వర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్న్స్ రాష్ట్రీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మహిళా వర్సిటీ వేదికగా మంగళవారం శ్రీలంక ప్రీ స్కూల్ టీచర్లకు చైల్డ్ డెవలప్మెంట్ ఫర్ ప్రీస్కూల్ టీచర్స్ అనే అంశంపై ఉపాధ్యాయులకు ఒకరోజు సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ హాజరయ్యారు. చిన్నపిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ప్రీ స్కూల్ టీచర్లేనని కొనియాడారు. అనంతరం శ్రీలంక హెచ్ఈఎఫ్సీవైఈ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కేఎంఎండబ్ల్యూబీ గల్కడువా మాట్లాడుతూ.. శ్రీలంక టీచర్లకు వర్సిటీలో శిక్షణ పొందే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. సెమినార్లో రిజిస్ట్రార్ రజిని, లా విభాగాధిపతి ప్రొఫెసర్ సీతాకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సుందరవల్లి, ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ ఉష, శోభారాణి, రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, అధ్యాపకులు, శ్రీలంక ప్రీ స్కూల్ టీచర్ల బృందం పాల్గొన్నారు.