
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : జేసీ
పాకాల : మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జేసీ శుభం బన్సల్ మంగళవారం దామలచెరువులోని ర్యాంప్ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.3కు మామిడిని కొనుగోలు చేయడం సరికాదన్నారు. గిట్టుబాటు ధరకు మామిడిని కొనుగోలు చేయాలని కోరారు. అలాగే దామలచెరువులో ఉన్న అన్ని ర్యాంపులను తెరవాలని అన్నారు. ఫ్యాక్టరీల వద్ద మామిడి కాయలు తీసుకోవడం లేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. వారితో కూడా సంప్రదింపులు జరిపి మామిడి కాయలను తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. స్థానికంగా మామిడి రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు గిట్టుబాటు ధరకు మామిడిని కొనుగోలు చేయానలి సూచించారు.