
మామిడి రైతును ఇబ్బంది పెట్టొద్దు
కేవీబీపురం, బీఎన్కండ్రిగ : జిల్లాలో మామిడి పంట రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. మంగళవారం కేవీబీపురం మండల కేంద్రంలోని దేవరాజ్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ, బీఎన్కండ్రిగ సమీపంలోని రాస మామిడి గుజ్జు పరిశ్రమను కలెక్టర్ తనిఖీ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి రైతుల నుంచి ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం అదనంగా నాలుగు రూపాయలు రైతులకు ఇస్తుందన్నారు.ఆయన వెంట సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మండల తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో మాలతి, ఉద్యానవన సత్యవేడు అధికారి రాధారాణి పాల్గొన్నారు.