బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్నల వర్షం | Telangana high Court Hearing On BC Reservations Issue | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్నల వర్షం

Oct 8 2025 10:27 AM | Updated on Oct 8 2025 4:59 PM

Telangana high Court Hearing On BC Reservations Issue

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15వరకు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున అభిషేక్‌ సింఘ్వి వాదనలు వినిపించారు. 
 
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ:

  • తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాడివేడిగా కొనసాగాయి  
  • తెలంగాణ ప్రభుత్వం తరుఫును  అభిషేక్‌ సింఘ్వి వాదనలు
  • రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది
  • ఇప్పటి వరకూ రిజర్వేషన్‌ బిల్లును ఎవరూ ఛాలెంజ్‌ చేయలేదు
  • రిజర్వేషన్లు 50శాతం మించకూడదని కచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదు
  • కచ్చితమైన ప్రాదమిక,సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండొచ్చు
  • రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదనుకుంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్ధం లేదు’ అంటూ వాదన

    తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
     
  • సింఘ్వి వాదానాల అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం
  • బీసీ రిజ్వర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్విహించారు?
  • ట్రిపుల్‌ టెస్టు విధానాన్ని అనుసరించారా?
  • ప్రజల అభ్యంతరాలను తీసుకున్నారు?
  • గవర్నర్‌ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది
  • కమిషన్‌ రిపోర్టు పబ్లిష్‌ చేశారా? 
  • షెడ్యూల్‌ నోటిఫై అ‍య్యిందా? అని ఏజిని ప్రశ్నించిన హైకోర్టు
  • అందుకు   
  •  ఇంకా వాదనలు ఉన్నాయి.. విచారణ రేపటికి వాయిదా వేయాలన్న ఏజీ 
  • ఇంక వాదనలు అవసరం లేదు.. విచారణ ముగిస్తున్నాం’అంటూ వ్యాఖ్యానించిన హైకోర్టు

హైకోర్టు ప్రశ్నలు:

  • అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పాస్‌ ఎప్పుడైంది?.
  • ఆమోదం కోసం గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉందా?.
  • బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?.
  • గవర్నర్‌ పేరు మీద జీవో జారీ చేశారా?. 
  • రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?.

పిటిషనర్‌ తరఫున వివేక్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ...
నోటిఫికేషన్‌ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్‌ తెలిపారు. 42 శాతం బిల్లు పాస్‌ అయింది కానీ.. గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉందని పిటిషనర్‌ తరఫు లాయర్లు చెప్పారు. ట్రిపుల్‌ టెస్టు పాస్‌ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. ‍కేవలం వన్‌ మ్యాన్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు అని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు పాస్‌ అయ్యింది కానీ, గవర్నర్‌ ఆమోదం తెలపలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. 

కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంపిరికల్‌ డేటా కూడా సరిగా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్‌ టెస్టు మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్‌లో ట్రిపుల్‌ టెస్టు మార్గదర్శకాలు విడదలయ్యాయి. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ట్రిపుల్‌ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్‌ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచవచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వాయిదా

అంతకుముందు.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు తెలిపారు. అలాగే, రిజర్వేషన్లపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్‌ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement