TG: కలెక్టర్‌పై దాడి.. ప్రభుత్వం సీరియస్‌ | Telangana Government Serious On Vikarabad Collector Incident | Sakshi
Sakshi News home page

TG: కలెక్టర్‌పై దాడి.. ప్రభుత్వం సీరియస్‌

Nov 11 2024 5:23 PM | Updated on Nov 11 2024 6:19 PM

Telangana Government Serious On Vikarabad Collector Incident

సాక్షి,హైదరాబాద్‌:వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై లగచర్ల గ్రామంలో సోమవారం(నవంబర్‌ 11) ఉదయం జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్‌ మీద దాడి జరగడంపై రిపోర్ట్‌ ఇవ్వాలని సీఎస్‌,డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది.

కాగా, కలెక్టర్‌పై దాడి ఘటన మీద సీఎస్‌ శాంతికుమారి ఇప్పటికే ఆరా తీశారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో సీఎస్‌ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఘటనపై నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎస్‌ ఆదేశించారు. కాగా, ఫార్మా కంపెనీల కోసం భూ సేకరణ విషయమై వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ లగచర్ల వెళ్లినపుడు గ్రామస్తులు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. 

Vikarabad: కలెక్టర్‌పై దాడి చేసిన రైతులు

ఇదీ చదవండి: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement