డాక్టర్‌.. తమిళిసై

Tamilisai Soundararajan: Master Health Checkup Camp Held At Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ క్యాంప్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఇటీవల ఓ ఉద్యోగి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడంతో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్‌ఐ వైద్య కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.  

విశాఖ వెళ్లిన గవర్నర్‌
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మంగళవారం సాయంత్రం 6.25 గంటలకు విశాఖ చేరుకున్నారు. ఆమెకు అధికారులు, బీజేపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా నగరంలో సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్లారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top