
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పాఠశాలల అసోసియేషన్ జాతీయ కార్యదర్శిగా ఉడుముల సుందరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న సుందరి విద్యారంగంలో అనేక ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు.