తల్లి మృతదేహంతో నాలుగు రోజులు ఇంట్లోనే.. | Sad Incident In Secunderabad Warasiguda | Sakshi
Sakshi News home page

హృదయ విదారకం..తల్లి మృతదేహంతో నాలుగు రోజులు ఇంట్లోనే

Jan 31 2025 8:36 PM | Updated on Jan 31 2025 8:48 PM

Sad Incident In Secunderabad Warasiguda

సాక్షి,హైదరాబాద్‌:సికింద్రాబాద్ వారసిగూడలో  హృదయ విదారక  ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో నాలుగురోజుల క్రితం లలిత అనే గృహిణి  ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు సైతం తల్లితోపాటు ఆత్మహత్యకు  ప్రయత్నించగా  ధైర్యం సరిపోక విరమించుకున్నారు. 

దీంతో తల్లి మృతదేహంతో  కుమార్తెలిద్దరూ నాలుగురోజుల పాటు ఇంట్లోనే ఉంపోయారు. దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ప్రశ్నించగా విషయం బయటపడింది.

తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేవని కుమార్తెలు చెప్పడంతో విషయం పోలీసులకు చేరంది. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement