అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్‌ అవతారమెత్తి.. | Industrialist Ravinder Gouds Threat Case, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్‌ అవతారమెత్తి..

May 29 2025 8:23 AM | Updated on May 29 2025 10:50 AM

Ravinder Gouds threat case

తన ఇంటి ఓనర్‌ను టార్గెట్‌ చేసి బెదిరింపులు 

నిందితుల అరెస్ట్‌  

 రవీందర్‌ గౌడ్‌ను బెదిరించిన కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్: పారిశ్రామిక వేత్త కూన రవీందర్‌ గౌడ్‌ను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు ఇద్దరు సూడో నక్సలైట్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాడు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్‌ ఏసీపీ పింగళి నరేష్‌ రెడ్డి, ఇన్స్‌పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ డీఐ కనకయ్యలతో కలిసి  వివరాలు వెల్లడించారు. విజయవాడ, గన్నవరానికి చెందిన యర్రంశెట్టి రాజు అక్కడ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. వ్యసనాలకు బానిసైన అతను అప్పులు చేసి జల్సా చేశాడు.  అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో షాపూర్‌నగర్‌లో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూన రవీందర్‌గౌడ్‌ను బెదిరించి డబ్బు లాగాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా గన్నవరానికి చెందిన తన స్నేహితుడు కందురెల్లి రాజు(24)ను నగరానికి రప్పించుకున్నాడు.  ఈనెల 21న రాత్రి పథకం ప్రకారం కందురెల్లి రాజును కూన రవీందర్‌గౌడ్‌ ఇంటికి పంపించాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే అతను మెయిన్‌ గేట్‌లోనుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న తులసి మొక్కను పీకేశాడు. 

అనంతరం ఎర్రరంగు టవల్‌లో ఓ లేఖను ఉంచి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రవీందర్‌గౌడ్‌ కారుపై ఉన్న లేఖను చదివిన రవీందర్‌ గౌడ్‌ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సవాల్‌ తీసుకున్న పోలీసులు ఏసీపీ నరేష్‌ రెడ్డి నేతృత్వంలో జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్‌సాగర్‌ రంగంలోకి దిగారు. దాదాపు 500 సీసీ కెమరాలను పరిశీలించి రవాందర్‌గౌడ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్న యర్రంశెట్టి రాజును నిందితుడిగా గుర్తించారు.

దీంతో యర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 13నాటు బాంబులు, 4 సెల్‌ఫోన్‌లు, ఒక బెదిరింపు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును చేదించిన ఇన్‌స్పెక్టర్‌ మల్లే‹Ù, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్‌సాగర్, పీసీలు నరేష్, రవినాయక్, వెంకటే‹Ùలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా నాటు బాంబులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement