చినజీయర్‌ ఆశ్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం

Madhya Pradesh CM Shivraj Singh Chouhan Visited Chinna Jeeyar Swamy Ashram - Sakshi

శంషాబాద్‌ రూరల్‌: శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శనివారం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరం చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రుత్వికులు స్వాగతం పలికారు.

అనంతరం సీఎం దంపతులు ఆశ్రమంలో స్వామికి నమస్కరించి కానుకలు అందజేశారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను స్వామి ఆశీర్వదించి, ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top