
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం మంగళవారం బలహీనపడింది.
దీంతో తెలంగాణలో చాలా చోట్ల బుధ,గురు,శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగనుంది.