పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆదేశం

Immediate Corona Compassionate Appointments Says T Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19తో మరణించిన పురపాలక ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు, కరోనాతో మరణించిన ఉద్యోగుల వివరాలతో పాటు కారుణ్య నియామకాల కోసం వారి వారసుల నుంచి వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని రెండు రోజుల్లోగా నిర్దేశిత నమూనాలో పంపించాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో పురోగతిపై ప్రతీ వారం నివేదికలు సమరి్పంచాలని పురపాలక శాఖ ప్రాంతీయ డైరెక్టర్లను కోరారు. అర్హులైన దరఖాస్తుదారులకు రెండు, మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top