హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పాల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్స్టాప్ సమీపంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. జేబులో ‘నాన్న’ నంబర్!


