సాక్షి హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నిజాంపేట్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, చిల్కానగర్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వేళ సూర్యుని వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రాత్రివేళ ఈ జల్లులు కొద్దిమేర ఉపశమనం కలిగించాయి. అయితే రాత్రి పదిగంటల ప్రాంతంలో వర్షం కురవడంతో ట్రాఫిక్కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.


